CM KCR: ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ లేఖ రాశారు .. సీఎం కేసిఆర్ నిర్ణయాన్ని తీసేసుకున్నారు.. అదేంటో అర్ధం అయ్యింది కదా.. సెప్టెంబర్ 17న తెలంగాణలో జాతీయ సమైక్యత దినోత్సవం జరపాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసిఆర్ లకు లేఖ రాశామని తెలిపారు. తెలంగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని అసదుద్దీన్ గుర్తు చేశారు. తురేబాజ్ ఖాన్ వీరోచిత పోరాటం చేశారని ఆయన వివరించారు. సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహిస్తామని చెప్పారు ఒవైసీ. ఎంఐఎం నిర్వహించే బహిరంగ సభల్లో పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు.
హైదరాబాద్ సంస్థానాన్ని సెప్టెంబర్ 17న భారత్ లో విలీనమైన రోజు అని, ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందనీ, అయితే అలా కాకుండా అందరినీ భాగస్వామ్యులను చేస్తూ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపాలని ఒవైసీ కోరారు. ఇలా ఒవైసీ లేఖ రాశారో లేదో కేసిఆర్ నిర్ణయాన్ని తీసుకున్నారు. శనివారం సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ఈ మేరకు కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా జరపాలనీ, 16,17,18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు జరపాలనీ, ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 2023 సెప్టెంబర్ 17,18,19 తేదీల్లో ముగింపు వేడుకలు జరపాలని నిర్ణయించింది.
తెలంగాణ సీఎం కేసిఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్
కేబినెట్ ఆమోదించిన ఇతర కీలక అంశాలు
ఇక కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలను చర్చించి ఆమోదించింది. పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల వ్యాప్తంగా రెవెన్యూ, ఫారెస్టు, ట్రైబల్ వెల్పేర్ శాఖల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. దళిత బంధు పథకం కింద నియోజకవర్గాల వారిగా ప్రస్తుతం అందజేస్తున్న వంద మందితో పాటు మరో 500 మందికి పథకాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. హూజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం గా అమలు చేస్తున్న నేపథ్యంలో మిగిలిన 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్దిదారులను గుర్తించి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. జీహెచ్ ఎంసీ, మరియు మున్సిపల్ కార్పోరేషన్ లలో కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంచాలని తీర్మానించింది. నూతనంగా ఏర్పడిన ఫారెస్టు యూనివర్శిటికీ కొత్త పోస్టులు మంజూరు చేయాలని కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్ నీటి సరఫరా వ్యవస్థ మెరుగుకు రూ.2214.79 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ కేబినెట్ తీర్మానం ఆమోదించింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టుల భవనాల నిర్మాణానికి 21 జిల్లా కేంద్రాల్లో స్థలాలు కేటాయింపు జరపాలని, భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించి ఇవ్వాలని తీర్మానించింది.