Telugu States: కొద్ది నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ లీటరు వంద రూపాయలు దాడి పోయింది. ప్రధానంగా డీజిల్ ధర పెరగడంతో రవాణా రంగంపై ఆధారపడి ఉన్న అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ మెట్టు దిగింది. సామాన్యులకు ఊరట కల్గించేందుకు కేంద్రం దీపావళి పండుగ సందర్భంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. నిన్న కేంద్రం ఈ శుభా వార్త అందించడంతో సామాన్యులకు కాస్త ఊరట కల్గింది.
Read More: BJP: తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్ధిగా ఈటల ..?
Telugu States: ఇక రాష్ట్రాల వంతు..
లీటరు పెట్రోల్ పై రూ.5 లు, లీటరు డీజిల్ పై రూ.10లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు దీపాపళి పండుగ రోజైన గురువారం నుండే అమలులోకి తీసుకువచ్చింది. కేంద్రంఏక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గిస్తే లీటరు పెట్రోల్, డీజిల్ వంద రూపాయల లోపుగా అందుబాటులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు స్పందించాయి. అస్సోం, త్రిపుర, గోవా, మణిపూర్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై రూ.7 ల వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్ లీటరు పై రూ.12, డీజిల్ లీటరు పై రూ.17 లు తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయల లోపుకు వచ్చేశాయి.
తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఒత్తిడి
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించిన విషయాన్ని తెలియజేస్తూ ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఏపి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు ఈ మేరకు సీఎంలు వైఎస్ జగన్, కేసిఆర్ లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రెండు ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా ఏపి పరిస్థితి దారుణంగా ఉంది. అప్పులు చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ నేతల డిమాండ్ కు తలొగ్గి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తే పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అయితే కేంద్రం ఏదో విధంగా నిధులను సమకూర్చే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్ధిక ప్రయోజనాలకు కేంద్రం అంతగా చేయూతను అందించే అవకాశం ఉండదు. ఇతర రాష్ట్రాల మాదిరిగా వ్యాట్ తగ్గించకపోతే ప్రజల నుండి వ్యతిరేకత మూట గట్టుకోవాల్సి వస్తుంది. వ్యాట్ తగ్గిస్తే పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అదాయంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పరీక్ష నుండి ఎలా గట్టేక్కుతారో చూడాలి మరి.,