Telangana Assembly Polls: తెలంగాణలో అధికారమే లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తొంది. సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాల ఎంపికపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ .. రెండో జాబితాపై కసరత్తు చేస్తొంది. అభ్యర్ధుల జాబితా తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తొంది. రెండో జాబితా ఏ క్షణమైనా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో భాగంగా రేపు ఉదయం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్ధులను ఫైనల్ చేసి ప్రకటించనున్నది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో అయిదు స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొన్నట్లు తెలుస్తొంది. సామాజిక సమీకరణాలు ఆ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఫేట్ మార్చనున్నది. ముక్తల్ టికెట్ బీసీలకు ఇస్తే జడ్చర్ల స్థానం రెడ్డి సామాజికవర్గానికి ఇచ్చే అవకాశం ఉంది.
Revanth Reddy: ఆ అధికారులను బదిలీ చేయాల్సి చేయాల్సిందే .. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
అలాగే ముక్తల్ నుండి శ్రీహరి ముదిరాజ్, జడ్చర్ల నుండి ఎర్ర శేఖర్ ముదిరాజ్ లు ఆశిస్తున్నారు. తాండూరు టికెట్ మనోహర్ రెడ్డికి, మహేశ్వరం టికెట్ ను కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాతా రెడ్డిలు ఆశిస్తుండగా లక్ష్మారెడ్డికి ఇచ్చే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తొంది. ముక్తల్ నుండి శ్రీహరి ముదిరాజు, ప్రశాంత్ రెడ్డి ఆశిస్తున్నారు. జడ్చర్ల ఎర్ర శేఖర్ ముదిరాజ్, అనిరుథ్ రెడ్డి, తుంగతుర్తి నుండి అద్దంకి దయాకర్, డాక్టర్ వడ్డేపల్లి రవిలు పోటీ నెలకొంది.
Telangana Assembly Elections: బీఆర్ఎస్ కు బైబై చెప్పిన మరో ఎమ్మెల్సీ