తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుమఖం పట్టనందున ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే సోమ, మంగళ, బుధవారం వరకూ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరో రోజులు గురు, శుక్ర, శనివారం వరకు సెలవులను పొడిగించింది. 17వ తేదీ ఆదివారం కావడంతో 18వ తేదీ (సోమవారం) తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. వర్షాల కారణంగా వరుసగా ఈ వారం రోజులు విద్యాసంస్థలు మూతపడ్డాయి.
బ్రేకింగ్: ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం