YS Sharmila: కేసిఆర్ ప్రభుత్వం తన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గత అర్ధరాత్రి తర్వాత పోలీసులు అరెస్టు చేసి ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ షర్మిల అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్బంగా ఆదివారం రాత్రి వైెఎస్ షర్మిల వీడియోను పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆసుపత్రిలో బెడ్ పై నుండే వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసిఆర్ సర్కార్ పై మరో సారి విమర్శలు సంధించారు.
KCRs BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్
గౌరవ హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా.. కేసిఆర్ మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. అకారణంగా తమ పార్టీ కార్యాలయం వద్ద కర్ఫ్యూ విధించారన్నారు. ఇవన్నీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారన్నారు. “మీ త్యాగాలను వైఎస్ఆర్ బిడ్డ ఎన్నటికీ మరవదు. వై ఎస్ఆర్ పై మీకున్న అభిమానాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారు” అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వైఎస్ఆర్ బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం కేసిఆర్ తరం కాదు అని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా వైఎస్ఆర్ సంక్షేమ పాలన ప్రజలకు అందించే వరకు ఈ పోరాటం ఆగదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila: వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష భగ్నం .. అర్దరాత్రి బలవంతంగా అపోలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మీ త్యాగాలను YSR బిడ్డ ఎన్నటికీ మరవదు.YSRపై మీకున్న అభిమానాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారు.YSR బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం KCR తరం కాదు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా YSR సంక్షేమ పాలన ప్రజలకు అందించే వరకు ఈ పోరాటం ఆగదు.
జై తెలంగాణ
జోహార్ వైయస్ఆర్
2/2— YS Sharmila (@realyssharmila) December 11, 2022