దేవుడమ్మ ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనం తీసుకొని గుడికి వస్తారు.. మరోవైపు రామ్మూర్తి వాళ్ళ కుటుంబం కూడా భవనం ఎత్తుకొని గుడికి వస్తారు.. ఒకరికొకరు ఎదురు పొదురుగా నిలుస్తారు రెండు కుటుంబాలు.. అప్పుడే దేవుడమ్మ మీ కోడలు రాలేదు ఏంటి అని అడుగుతుంది జానకమ్మని.. తను ఎప్పుడు ఏ పేరంటానికి కానీ ఎక్కడికి రాదు ఎందుకు అని అడుగుతుంది.. తనకు ఏవో సమస్యలు ఉండి ఉంటాయి అని ఆదిత్య సర్ది చెబుతాడు..
ఆదిత్య అమ్మవారి ముందు నా బిడ్డ నా భార్య నా దగ్గరకు వచ్చేలా చేయమని దండం పెట్టుకుంటాడు.. నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు అని మాధవ్ అంటాడు.. నీ కూతురు గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నానో నేను నా బిడ్డ గురించి నేను అలాగే ఆలోచిస్తున్నారు.. దేవి నా హక్కు.. ఆ హక్కు త్వరలోనే నా దగ్గర కు వస్తుంది.. నీ కూతురు బాధపడుతుంది అని నువ్వు ఇందంత స్వార్థంతో చేస్తుంటే.. ఆ నిజాన్ని త్వరలోనే దేవికి తెలుస్తుంది.. నీతో గొడవ పడి నా కూతురిని ఇక్కడి నుండే తీసుకు వెళ్ళాలి అని అనుకుంటే.. నేను ఇప్పుడే తీసుకు వెళ్తాను అని ఆదిత్య అంటాడు..
రాధ బోనం ఎత్తి నా బిడ్డను వాళ్ళ నాన్న దగ్గరకు చేర్చమని మొక్కుకుంటింది.. రుక్మిణీ బోనం ను ఎత్తి ఆ బోనం ను ఊర్లో ఉన్న ఒక అమ్మవారి దగ్గర దించుతుండగా.. రుక్కవ్వ ఆగు.. అందరూ బోనం ఆ గంగమ్మ గుడిలో దించమని చెబుతుంది.. ఇలా ఇంకా ఎన్ని రోజులు బిడ్డా అని అంటుంది భాగ్యమ్మా.. నీ కష్టం తీరాలంటే ఆ బోనం నేరుగా ఆ గుడికి పోయి అక్కడ దింపమని భాగ్యమ్మా చెబుతుంది.. ఇక రుక్మిణీ మొఖం కనిపించకుండా పసుపు రాసి పంపిస్తుంది భాగ్యమ్మా..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!