హైదరాబాద్,మార్చి 16: వైసిపి లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.
తొలి జాబితాలో తొమ్మిది మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్టి ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రభాకరరెడ్డి మాట్లాడితూ. . రేపు పులివెందులలో పార్టీ అధనేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేయాలని భావించారనీ, అయితే నేడు మంచి ముహూర్తంలో తొలి జాబితా విడుదల చేయాలని శ్రీ స్వరూపానంద స్వామి సూచించడంతో పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి అదేశాల మేరకు తొమ్మిది మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించామని తెలిపారు.
ఆదివారం ఉదయం అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను పులివెందులలో వైఎస్ జగన్ ప్రకటిస్తారని చెప్పారు.
అభ్యర్థుల పేర్లు…
1. కడప – వైఎస్ అవినాష్ రెడ్డి
2. అరకు – మాధవి
3. అనంతపూర్ – తలారి రంగయ్య
4. చిత్తూరు – ఎన్.రెడ్డప్ప
5. బాపట్ల – నందిగామ సురేష్
6. హిందూపురం – గోరంట్ల మాధవ్
7. రాజంపేట – పీవీ మిథున్ రెడ్డి
8. కర్నూల్ – సంజీవ్ కుమార్
9. అమలాపురం – అనురాధ