ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ‘తొమ్మిది’ అదృష్ట సంఖ్యపై చాలా నమ్మకం పెట్టుకున్నట్లు కనబడుతొంది.
ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్ధుల సంఖ్యను చూస్తే అంకెల శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోంది.
ప్రధమంగా జనసేన పార్టీ తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్, 32 అసెంబ్లీ టికెట్ లకు అభ్యర్థులను ప్రకటించింది. 32+4=36, 3+6=9
అదే విధంగా తెలుగుదేశం పార్టీ 126మందితో అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. ఇక్కడ పరిశీలించినా 1+2+6=9
చివరగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తొమ్మిది మందితోనే లోక్ సభ ఆభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసింది.
దీన్ని బట్టి చూస్తే సంఖ్యా శాస్త్రానికి పార్టీలన్ని అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడుతోంది.
సాధారణంగా వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ లకు సైతం టోటల్ నైన్ నెంబర్ లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఒకరు కంటే ఎక్కువ మంది టోటల్ నైన్ నెంబర్ కు పోటిపడిన సమయంలో వేలం(ఆక్షన్) ద్వారా నెంబర్ లను కేటాయిస్తుంటారు రవాణా శాఖ అధికారులు.
తొమ్మిది సంఖ్యకు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధిక ప్రాధాన్యత నిస్తుంటారు.
9అంకెను కొన్ని చోట్ల తొమ్మిదికి బదులు ‘నవ’ ఉపయోగిస్తారు. ఉదాహరణకు తొమ్మిది గ్రహాలను నవగ్రహాలు అంటారు.