అమరావతి. మార్చి 17: ఎట్టకేలకు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి (మాజీ సిబిఐ జెడి) వివి లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
నేడు జనసేనలో చేరుతున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఉదయం 10. 30 గం.కు జనసేనలో ఆయన చేరుతున్నారు.
రాత్రి ఒంటిగంటకు జనసేన అధినేత పవన్కల్యాణ్ను కలిసిన లక్ష్మీనారాయణ సుమారు 45 నిమిషాలపాటు చర్చించారు.
నేడు లక్ష్మీనారాయణతో పాటు ఎస్కేయు మాజీ ఉపకులపతి శ్రీరాజగోపాల్ జనసేనలో చేరుతున్నారు.