అమరావతి, మార్చి 17: నామినేషన్ ల స్వీకరణ మరో ఒక రోజులో ప్రారంభం కానుండటంతో టిడిపి మరో 15మంది అసెంబ్లీ అభ్యర్ధులతో రెండవ జాబితా విడుదల చేసింది. రెండు రోజుల క్రితం 126మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
శనివారం అర్ధ్ర రాత్రి దాటిన తరువాత రెండవ జాబితా విడుదల చేశారు.
సూళ్లూరుపేట పరసా వెంకటరత్నం, నందికొట్కూరు బండి జయరాజు, బనగానపల్లె జనార్దన్ రెడ్డి, రాయ దుర్గం కాల్వ శ్రీనివాసులు , ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జెసి అశ్విత్ రెడ్డి, మడకశిర ఈరన్న, మదనపల్లి దమ్మాలపాటి రమేష్ , చిత్తూరు ఏసీ మనోహర్ , పాలకొండ నమ్మక జయకృష్ణ, ఇచ్చాపురం ఎస్ వి ఎస్ ఎన్ వర్మ, రంపచోడవరం రాజేరశ్వరి, ఉంగుటూరు వీరాంజనేయులు, పెడన కాగిత వెంకట కృష్ణ ప్రసాద్ , పామర్రు ఉప్పులేటి కల్పన లను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు.