Aryan Khan Drugs Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబాయి క్రూజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ సాక్షి ప్రభాకర్ సెయిల్ ఆకస్మికంగా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ప్రభాకర్ సెయిల్ ప్రాణాలు కోల్పోయాడని అతని తరపు న్యాయవాది తుషార్ ఖండేలా వెల్లడించారు. ప్రభాకర్ ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చిందనీ, ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. అయితే ప్రభాకర్ మృతిపై మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్షే పాటిల్ అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆరోగ్యంగా, ధృఢంగా ఉన్న ఒక వ్యక్తి అంత అకస్మాత్తుగా ఎలా మరణిస్తాడు అని మంత్రి పాటిల్ వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ మృతిపై విచారణ జరిపిస్తామని, పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తారని ఆయన చెప్పారు.
Read More: Jagan Strategy: జగన్ ప్లాన్ లో టీడీపీ చిక్కకుంటే ..!? కోటి ఓట్లపై జగన్ గురి..!?
Aryan Khan Drugs Case: ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ పై ఆరోపణలు చేసిన ప్రభాకర్ సెయిల్
క్రూజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిిందే. ఈ కేసులో కేపీ గోసావి తో సహా ఆయన సెక్యురిటీ గార్డ్ గా పని చేసే ప్రభాకర్ సెయిల్ సాక్షిగా ఉన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ తర్వాత ఎన్ సీబీ పైనే ఆరోపణలు చేశారు. అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నుండి తనకు ప్రాణ హాని ఉందని, ముడుపుల వ్యవహారం నడుస్తోందంటూ కోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించాడు ప్రబాకర్ సెయిల్. ప్రభాకర్ సెయిల్ మరణించడంతో తను చేసిన ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుండగా శుక్రవారం తన నివాసంలో ప్రభాకర్ సెయిల్ మృతి చెందడంతో ఈ కేసు ఏ విధమైన మలుపు తిరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారుతోంది.