బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది. అయితే హౌస్ లోని కంటెస్టెంట్స్ విచక్షణ మరచిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కూడా కొంతమంది ప్రేక్షకులకు చిర్రెత్తించింది. ముఖ్యంగా సోహెల్…. మెహబూబ్…. అఖిల్ అన్న మాటలు కొన్ని షో లో బీప్ చేయవలసి వచ్చింది.
వివరాల్లోకి వెళితే రోబో టీమ్ దివి ని కిడ్నాప్ చేసిన తర్వాత తనకు అన్నం పెట్టి చెమట వేయకుండా గాలి కూడా వచ్చేలా ఊపుతూ ఉన్నారు. కేవలం తమ గేమ్ లో ఒక స్ట్రాటజీ లాగానే దీనిని తీసుకున్నాము కానీ మాకు ఇంకేమీ అవసరం లేదని ఆ టీమ్ సభ్యులు వాదించారు. అయితే బయట ఉన్న మనిషుల టీమ్ మాత్రం కుమార్ పై విరుచుకుపడ్డారు. సభ్యుల్లో కొందరు బూతులు కూడా తిడుతూ ఉండడం గమనార్హం. అలాగే చార్జింగ్ వైర్ ను తెంపివేయడం…. బిగ్ బాస్ ను వారు అంటే గేమ్ ఆడుతున్నారు మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని కెమెరా ముందుకు వచ్చి నిలదీయడం వంటివి జరిగాయి.
ఇక సోహెల్ అయితే ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. కుమార్ సాయికి బయటికి వస్తావు దొరుకుతావు.. నీ కథ వేరే ఉంటుంది అని వార్నింగ్ లపై వార్నింగ్ లు ఇచ్చేసాడు. ఇక డోర్ ఓపెన్ అయిన తర్వాత వారి లోపలికి వెళ్లి వాగ్వాదం చేసుకున్నారే తప్ప ఏమీ లేదు. ఇక ప్రేక్షకులు సైతం చాలామంది రోబో టీమ్ కు సోషల్ మీడియా లో మద్దతుగా నిలుస్తున్నారు. వారిలో అభిజిత్ ముందు చూపు కి ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు.
దివి కూడా దీనిని చాలా క్రీడా స్ఫూర్తి గా తీసుకుంది కానీ మనుషుల టీంలో మోనాల్ ఏడ్చేసింది మెహబూబ్ దమ్ముంటే నన్ను తీసుకెళ్లండి అంటూ రెచ్చిపోయాడు. సోహెల్ అయితే అది ఘోరంగా అవతలి వారిపై విరుచుకు పడ్డారు. వీరందరికీ శనివారం నాగార్జున చేతిలో గట్టి కోటింగ్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!