అయ్య బాబోయ్.. బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అవ్వడం ఏమో కానీ.. తెగ టెన్షన్ పెట్టిస్తోంది ప్రేక్షకులను. మొన్నటి వరకు కరోనా వల్ల అసలు ఈ సీజన్ స్టార్ అవుతుందా? లేదా? అంతా తెగ టెన్షన్ పడ్డారు. చివరకు షో ప్రారంభం అవుతుందని సంకేతాలు వచ్చాయి. వరుసగా ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. తర్వాత కంటెస్టెంట్లను కూడా సెలెక్ట్ చేసేసినట్టు వార్తలు వచ్చాయి.
హౌస్ లో ఉండబోయే 16 మంది కంటెస్టెంట్లు వీళ్లు అటూ ప్రచారం కూడా జరిగింది. వాళ్లందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ లో ఉంచారని.. 14 రోజుల క్వారెంటైన్ ముగిశాక.. అప్పటికీ ఎవ్వరూ కరోనా బారిన పడకపోతే ఆగస్టు 30న షో ప్రారంభించడానికి మాటీవీ అన్ని సన్నాహాలు చేస్తోంది.
అయితే.. ఇప్పటికే కంటెస్టెంట్లు అంతా ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్నారు. వారిలో సింగర్ నోయల్ కు కరోనా పాజిటివ్ వచ్చిందట. దీంతో అతడికి సపరేట్ గా ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారట.
కట్ చేస్తే.. అసలు బిగ్ బాస్ షోను ప్రారంభించకూడదు. ఆపేయాలి.. అంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఆర్సీలో ఫిర్యాదు కూడా చేశారు.
కరోనా సమయంలో ఇంత రిస్క్ తీసుకొని ఇటువంటి షోను నిర్వహించడం అవసరమా? ఇలాంటి షోల వల్ల కరోనా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే.. ఈ షోను ఆపేయాలంటూ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదయింది. ఆ ఫిర్యాదును తెలంగాణ మహిళా అధ్యక్షురాలు రేఖ ముక్తల చేశారు.
ఆమెతో పాటు కొందరు సామాజిక కార్యకర్తలు కూడా హెచ్ఆర్సీలో షోకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మరి.. అధికారులు ఈ షోపై ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!