సాధారణంగా ప్రస్తుత కాలంలో మన ఇండియాలో అనేక వాహనాలు లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక వీటిలో బాగా పాపులర్ అయిన స్కూటర్స్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఒకటి. గతంలో ఎన్ని రకాల స్కూటర్స్ వచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోని కొనుగోలుదారులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై మనసు పారేసుకుంటున్నారు కొనుగోలుదారులు.
మన ఇండియా వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే పెట్రోల్ ధర కన్నా కరెంట్ ధర తక్కువవుతుంది అని ఆలోచించి ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే వాహనాల కంపెనీలు సైతం కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఇక దీంతో ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ గట్టిగా పెరిగింది.
ఒక్క దానికి మించి మరొక వెహికల్ ని లాంచ్ చేస్తూ ఎప్పటికప్పుడు కొనుగోలుదారులకి షాక్ ఇస్తున్నారు కంపెనీ అధికారులు. ఇక తాజాగా ఈ స్క్రిప్ట్ అమెరీ పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ బ్రాండ్ ను స్టార్ట్ కంపెనీ ల్యాండ్ చేసింది. ఈ బైక్ ధర అక్షరాల 1.20 లక్షల రూపాయలుగా తెలుస్తుంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. ఈ బైక్ వైట్ మరియు ఎల్లో, బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉంది. ఇక ఈ స్కూటర్ హైవే పైన గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఇక అంతే కాకుండా ఈ స్కూటర్కు 2.5kwh సామర్థ్యం ఉన్న మోటర్ బిగించారు. ఇక ఈ స్కూటర్ పికప్ కూడా బాగానే ఉంటుంది. ఒకసారి దీనికి ఫుల్ చార్జింగ్ పెడితే 140 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నట్లుగా కంపెనీ తెలియజేసింది. ఇక ఈ స్కూటర్ బ్యాటరీ ఒకసారి ఫుల్ చార్జ్ అవ్వాలంటే దాదాపు 5 గంటల సమయం పడుతుందట. ఇక ఈ స్కూటర్ అలా లాంచ్ అయిందో లేదో ఇలా కొనుగోలుదారులు కొనుగోలు మొదలు పెట్టేసారు.