HDFC Bank: ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుండడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.. దేశంలో లో మళ్లీ లాక్ డౌన్ విధించనున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో లో తన ఖాతాదారులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. హెచ్డీఎఫ్సీ మొబైల్ ఏటీఎం సేవలు ఆవిష్కరించింది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని హెచ్డిఎఫ్సి సంస్థ స్పష్టం చేసింది..
హైదరాబాద్ నగరంతో సహా దేశంలో ఉన్న 19 ప్రధాన ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా స్థానిక సంస్థల తో చర్చించి మొబైల్ ఏటీఎంలు ఏఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలో నిర్ణయం తీసుకోనుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్న నేపథ్యంలో.. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కూడా బ్యాంకులు పనివేళలకు సంబంధించి పలు సూచనలు చేసింది. పని గంటలు తగ్గించుకోవాలని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఓపెన్ లో ఉంటాయి. అలాగే ఈ మొబైల్ ఏటీఎంలో వలన కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వినియోగదారులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఉంటున్న ప్రదేశానికి ఎటిఎం వస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా బ్యాంకులు కూడా ఈ సదుపాయాన్ని ప్రవేశ పెడితే బాగుంటుంది.