Jathi Rathanalu : నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి పులికొండ రాహుల్ రామకృష్ణ కాంబోలో వస్తున్న ఫుల్ లెన్త్ కామెడీ డ్రామా జాతిరత్నాలు.. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.. స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి దర్శకుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మించాడు. అనుదీప్ కె.వి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రధన్ ఈ సినిమా కి సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసింది.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు..
ఈ టీజర్ ద్వారా హైప్ ను క్రియేట్ చేసింది.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాని శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర యూనిట్.. మన హాస్య రత్నాలు ఈ సినిమాలో ఎంత వరకు కామెడీని పండించారో తెలుసుకోవాలంటే మార్చి 11 వరకు వేచి చూడాలి..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!