Mahesh Babu: ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలైంది.. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే ఈ ఈ చిత్ర యూనిట్ లో కొంత మందికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ అర్ధంతరంగా నిలిపివేశారు.. తాజాగా సినిమా టీజర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది..
ప్రస్తుతం కరోనా సెకండ్ వైఫ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు హీరోల నటిస్తున్న సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిరోజు నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్టార్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఫ్యాన్స్ కు భారీ షాక్ అవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.. ఈనెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట టీజర్ విడుదల అవుతుందని ముందు నుంచే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అయితే కరోనా వల్ల టీజర్ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తాజా సమాచారం. అంతేకాకుండా మహేష్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ కూడా అదే రోజున ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే ఆ అప్ డేట్ కూడా రాకపోవచ్చని సమాచారం. సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే సిద్ధమైన మహేష్ సూచనమేరకు టీజర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు టాక్..
సర్కారు వారి పాట సినిమాను జిఎంబి ప్రొడక్షన్స్, 14 రీల్స్ , మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో మహేష్ సరసన మన కీర్తి సురేష్ నటిస్తోంది. మహేష్ బాబు ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మాధవన్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!