సావిత్రి అనే పేరు సినీ ఇండస్ట్రీలో మరిచిపోలేని ఒక బ్రాండ్ గా మారిపోయింది. సినీ ఇండస్ట్రీలోకి ఎంత మంది అందగత్తెలు వచ్చినా నటనను పండించడంలో ఆమెను మించినవారు ఎవరూ లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తన అద్బుతమైన నటన ద్వారా తనకు మించి ఎవరూ అంత బాగా నటించలేరని గుర్తింపు తెచ్చుకుంది మహానటి. పండ్లున్న చెట్టుకే రాళ్లంటారు. అందుకేనేమో.. ఈ తల్లిపై ఎన్నో రకాల అబాండాలు మీద వేశారు. కొందరు ఆమె దయాగుణం కలిగిన మంచి మనిషి అంటే.. మరికొందరు లేని ఆడంబరాలకు పోతే ఇలాగే ఏమీ లేకుండా పోతారంటూ వెక్కిరించే వారు చాలా మందే ఉన్నారు.
ఎందుకంటే ఆమెది ఎవరికింద చేతులు చాచే మనస్తత్వం కాదు. ఎందుకంటే ఆమె ఇతరుల బాధలు చూసి నాకెందుకులే అనుకునే మనిషి కాదు. అందుకే ఆమెకు ఈ పేర్లు పెట్టారేమోననిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే ఆమె జయంతి సందర్భంగా ప్రముఖ సీనియర్ నటుడు గుమ్మడి ఆమె గురించి చెప్పిన కొన్ని మాటలు చెప్పుకుందాం.. తెలుగు ఇండస్ట్రీలో సూర్యకాంతం తర్వాత నన్ను ప్రేమతో అన్నయ్య అని పిలిచింది కేవలం సావిత్రి మాత్రమే. అయితే ఒక సారి నాకు ఆరోగ్యం బాగులేకపోతే తాను నన్ను చూడటానికి వచ్చింది.
అప్పటికే ఆమె ఆర్థిక పరిస్థితి అంతా బాగా లేదు. కాని నన్ను చూడటానికి వచ్చినప్పుడు డాక్టర్ నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి రెస్ట్ తీసుకోమన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి నా తలదిండు దగ్గర రెండు వేల రూపాయలు పెట్టింది. ఆ సమయంలో నాకు మెలుకువ వచ్చింది. కాని అదేంటని చూడలేకపోయా. ఆమె వెళ్లిన తర్వాత చూస్తే అవి డబ్బులు. ఆతర్వాత నేను ఫోన్ చేసి ఎందుకు ఇచ్చావమ్మా అని అడిగితే.. గతంలో మీ వద్ద నేను రెండు వేలు తీసుకున్నాను కదా.. అవి నేను చనిపోయే లోపల ఇవ్వాలనుకున్నాను అన్నయ్య.
అందుకే ఇచ్చానని సమాధానమిచ్చింది. అప్పటికే ఆమె ఆర్థిక పరిస్థితి అంత బాగాలేకపోయినా నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి డబ్బులు ఇచ్చిందంటే ఆమె మనసు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. కోట్ల రూపాయలకు వారసురాలైనా నమ్మిన వారి చేతితో నిర్దాక్షినంగా మోసపోయింది. అనుకున్న వారే తన ఆస్తులను స్వాహా చేయడంతో ఆమె సంవత్సరం పాటు షెడ్డులో జీవించి నరక యాతన అనుభవించిందంటూ కన్నీటి పర్యంతమయ్యరు గుమ్మడి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!