RGV : ఒకప్పుడు నటుడిగా జె.డి.చక్రవర్తి…. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ తెలుగు చిత్ర పరిశ్రమలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘శివ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ రూపు మార్చేసిన వర్మ… అలాగే 90ల్లో ‘గులాబీ’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘సత్య’ వంటి చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న జె.డి.చక్రవర్తి ఇద్దరూ ఇప్పుడు మంచి ప్రాజెక్టులు లేకండా ఉన్నారు. వర్మ అంటే తనకు ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు కానీ జె.డి.చక్రవర్తి మాత్రం ఒక దశ దాటాక పట్టు కోల్పోవడం చాలా నాళ్ళు బ్రేక్ తీసుకున్నాడు.
ఇప్పుడు అతను ‘ఎంఎంఓఎఫ్’ అనే ఒక సినిమా చేశాడు. ఎస్ఎస్సి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జేడీ చక్రవర్తి తన గురువు రాంగోపాల్వర్మ నిర్మాణంలో తాను ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వర్మ-జెడి కాంబినేషన్లో సినిమా అంటే ఆసక్తి ఉంటుంది కానీ జెడి దర్శకుడిగా…. వర్మ నిర్మాతగా సినిమా అంటే కచ్చితంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నక్షత్రం’ సినిమాను నిర్మించిన వేణుగోపాల్ తో కలిసి రాంగోపాల్ వర్మ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం అదే చిత్రానికి జెడి దర్శకుడు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు పూర్తి వివరాలు వెల్లడిస్తానని జెడి చెప్పాడు. ఇక తన స్వీయనిర్మాణంలో తెలుగు, కన్నడ భాషల్లో మరొక సినిమా చేయబోతున్నట్లు చెప్పిన జెడి తన మాటలు,వర్మ మాటలు ఒకే రకంగా ఉంటాయి కానీ తమ ఇద్దరి జీవితాలు పూర్తి భిన్నమన్నాడు.
కుటుంబ బంధాల విషయంలో తను చాలా ఎమోషనల్ అని చెప్పిన జేడీ… వర్మ అలాంటివాటికి దూరంగా ఉంటానని చెప్పాడు. సాయంత్రం 7:00 అయితే వర్మ ఆఫీసు పార్టీలతో కళకళలాడిపోతోంది కానీ నేను మాత్రం 7 తర్వాత ఎవరినీ కలవనని చెప్పాడు. ఇక ‘ఎంఎంఓఎఫ్’ సినిమా గురించి మాట్లాడుతూ మల్టీప్లెక్స్ హవా నడుస్తున్న ఈ రోజుల్లో సింగిల్ థియేటర్లో పాత చిత్రాలు, బిట్ సినిమాలు నడుపుకునే వ్యక్తిగా తాను కనిపిస్తానని… అటువంటి థియేటర్ లో అనుకోకుండా హత్య జరిగితే ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోయిందో.. అదే ఈ సినిమా అని చెప్పాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!