Ola scooter: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ స్కూటర్ లపై మక్కువ చూపిస్తున్నారు. ఇక ఇది ధర ఎక్కువైనప్పటికీ కొందరు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం దీని ధరణి చూసి ఆశ్చర్యపోతూ వెనక్కి తగ్గుతున్నారు. ఇక తాజాగా రిపబ్లిక్ డే ఆఫర్లు పెట్టారు ఎలక్ట్రిక్ స్కూటర్స్ బ్రాండ్స్. ఈ తరుణంలోనే భారీ డిస్కౌంట్ ని సొంతం చేసుకోవచ్చు.
దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా కొనసాగుతున్న ఓలా భారీ ఆఫర్ ని తీసుకొచ్చింది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి బెస్ట్ ఛాయిస్ గా నిలిచింది. ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ ల పై ఏకంగా రూ. 25వేల తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది.
ఓలా అందించిన ఈ ఆఫర్ ఫిబ్రవరి 5 వరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. అంతే కాకుండా ఆక్సెండెడ్ వారంటీ పై 50% తగ్గింపు కూడా సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. రెండు వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఓలా ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎయిర్ మోడల్ లకు ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా కొనుగోలుదారులు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 5వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఇక ఈఎంఐ ప్రాసెసింగ్ పై కూడా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అలానే లోన్ తీసుకుంటే 7.99 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. అదనంగా ఎస్ 1 ఎక్స్ ప్లస్ మోడల్ రూ. 20వేల తగ్గింపుతో రూ. 89,999కే లభిస్తుంది. ఇక ఓలా మాత్రమే ఈ సౌకర్యాన్ని కలిగిస్తుంది. మరే కంపెనీకి ఎటువంటి డిస్కౌంట్ లేవు. అందువల్ల ఓలా కొనుక్కునేవారు కి ఇది సరైన సమయం అని చెప్పొచ్చు. ఈ బైక్స్ ని కొనుగోలు చేసి మీ డబ్బుని సేవ్ చేసుకోండి.