స్పైడర్ సినిమాలో హీరోయిన్గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్`లో అతిథి పాత్రలో నటించింది. అయితే తమిళ చిత్రాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు మన్మథుడు 2లో నటించబోతుంది. అయితే ఈమె ఆఫర్స్ బకెట్లో మరో తెలుగు చిత్రం చేరనుందని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. డైరెక్టర్ మారుతి, సాయిధరమ్తేజ్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ముందుగా రష్మిక మందన్నాను హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నా కూడా.. ఆమె బిజీగా ఉండటంతో మారుతి.. రకుల్ను తీసుకుంటే బావుంటుందని ఆమెను సంప్రదించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఓసారి విన్నర్ చిత్రంలో సాయిధరమ్ తేజ్ జతగా నటించింది రకుల్ ప్రీత్ సింగ్. అంతా ఓకే తర్వలోనే మరోసారి సాయిధరమ్ తేజ్తో తెరపై తళుక్కుంటుంది రకుల్.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!