భారతదేశంలో క్రికెట్ మరియు సినిమా అనేవి రెండు ప్రధాన మతాలుగా చెబుతుంటారు. కరోనా దెబ్బకు అవి రెండూ దేశ ప్రజలకు మూడు నెలలకు పైగా దూరం అయిపోగా ఇప్పుడు మళ్లీ 117 రోజుల తర్వాత ప్రపంచ క్రికెట్ మొదలు కాబోతోంది.
ఇంగ్లండ్ వేదికగా వెస్టిండీస్ జట్టు ఆతిథ్య టీం తో టెస్ట్ సిరీస్ను ఆడబోతోంది. నేపథ్యంలో ఇన్ని రోజులు ‘బబుల్’ పద్ధతిలో ట్రైనింగ్ తీసుకున్న వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఈరోజు మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 నిమిషాలకు మొదలయ్యే మొదటి టెస్ట్ ను ఆడనున్నారు.
ఈ సిరీస్ మొత్తాన్ని సోనీ సిక్స్ ఛానల్ లో భారత ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఇకపోతే మైదానంలోకి ఆటగాళ్ళందరూ కరోనా టెస్ట్ నెగిటివ్ అని వచ్చిన తర్వాతనే బరిలోనికి దిగుతారు. వీరందరినీ బయట ప్రపంచంతో దూరంగా ఎన్నో రోజులు ఉంచి ప్రాక్టీస్ చేయించారు. ఇక ఈ సిరీస్ కనుక విజయవంతం అయితే మిగతా క్రికెట్ బోర్డులు కూడా ఈ రకంగా ముందుకు సాగేందుకు మొగ్గుచూపుతారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!