ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల నిర్ణయం తో అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ అన్యాయానికి కారణం ఎవరు అన్న విషయాన్ని సరిగ్గా విశ్లేషించుకుంటే ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ముందుగా అసత్యాలు చెప్పి రైతుల వద్ద అవసరానికి మించి భూములు సేకరించి వాటిని రియల్టర్ల చేతిలో పెట్టి చేసింది బాబు అని ఇప్పుడు మెల్లగా ఒక్కో గొంతూ లేస్తోంది.
అసలు మూడు రాజధానులు కి వ్యతిరేకంగా అమరావతిలో చేపట్టిన ఉద్యమాలకు ‘పెయిడ్’ అన్న పేరు ఎప్పటినుంచో ఉంది. అందుకు తగ్గట్టు గానే డబ్బులిచ్చి జనాలను కూర్చోబెట్టడం… ఆ తర్వాత వారి దగ్గర డబ్బు కరిగిపోయాక వారికి కనీస వసతులు కల్పించలేకపోవడంతో ఉద్యమంలో జనాలు కరువైపోవడం…. దీనంతటికి కారణం సీక్రెట్ పెట్టుబడిదారులు అని బాబు మాత్రం రైతులకి నిజం చెప్పగలరా అన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. నిజంగా రైతులకు అసలు పరిస్థితి అర్థం అయి ఉంటే ఈ ఉద్యమాలన్నీ న్యాయంగా వైసీపీకి వ్యతిరేకంగా కాకుండా టీడీపీకి వ్యతిరేకంగా చేసే వారిని… తమకు న్యాయం జరిపించాలని టిడిపిని అడిగే వారిని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అసలు టిడిపి ముందుగా ‘పెయిడ్’ ఉద్యమానికి తెర తీసింది…. అనుకూల మీడియా తో వార్తల్లో హైలెట్ చేస్తూ ‘అమరావతి రగిలిపోతుంది’ అంటూ ఎక్కడ లేని కలరింగ్ ఇచ్చారు. దీక్షలో ఉన్న వారిని పరామర్శించి అదేదో సినిమా ఫంక్షన్ లాగా 50 రోజులు, వంద రోజులు…. సిల్వర్ జూబ్లీ అంటూ ఎక్కడలేని హడావిడి చేశారు. అయితే నిజంగా చంద్రబాబు రైతుల దగ్గర తీసుకున్న భూములను ఇన్సైడ్ ట్రేడింగ్, ఇక అనుకూల నాయకులకు తక్కువ ధరలకు అమ్మడం వంటి పనులు చేయకుండా కేవలం అభివృద్ధి కోసమే ఉపయోగించి ఉంటే జగన్ రాజధానిని మార్చేంత ధైర్యం చేయగలరా అన్నది ఇప్పుడు అందరి మాట.
కర్నూలు, ఉత్తరాంధ్ర వారి మాట పక్కన పెట్టండి…. చంద్రబాబు పూర్తిస్థాయిలో డబ్బును అమరావతి అభివృద్ధికి ఉపయోగించి ఉంటే జగన్ మాత్రం కేవలం అసెంబ్లీనే అక్కడ ఎందుకు ఉంచుతాడు? భవనాలన్నింటిని వృధాగా ఎందుకు పోనిస్తాడు> బాబు అక్కడ ఏమీ చేయలేదు కాబట్టే జగన్ కి అవకాశం దొరికిందని…. బాబు ఇప్పటికైనా నిజం ఒప్పుకోకపోతే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు అని రాజకీయ పండితులు చెబుతున్నారు. ముందుగా చాలా మంది కనీసం అసెంబ్లీ అయినా అమరావతి లో ఉంది చంద్రబాబు దయవల్ల అది కూడా ఇంకా పోలేదు అని అనుకుంటున్న సమయంలో బాబు మళ్ళీ ఉద్యమం అంటూ వస్తే కనీసం అతని వైపు తల తిప్పే వారు కూడా ఉండరు అన్నది ఇప్పుడు అందరి మాట.