ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 19న సమావేశం కానుంది. కరోనా ఉధృతి ప్రస్తుతం రాష్ట్రంలో విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో పలు కీలకాంశాలపై చర్చ జరగనుంది.
ముఖ్యంగా కరోనాపై తీసుకోవాల్సిన చర్యలపై స్పందించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై కూడా చర్చ ప్రధానంగా సాగనుంది. ఇటీవలే ఈ విషయంపై కమిటీ కూడా వేయడంతో జిల్లాల ఏర్పాటు అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి విశ్లేషించనున్నారు. కరోనాపై పోరాటం చేస్తూనే సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి జాప్యం ఉండకూడదని జగన్ మంత్రులతో చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇవి కాకుండా రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై కూడా చర్చించనున్నారు.