తెలంగాణ రాష్ట్రంలో ములుగు నియోజకవర్గం, ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క గత కొద్ది నెలల నుండి ఎంతో స్ఫూర్తిదాయకమైన పని తీరుని ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష పార్టీలో ఉంటున్నా కూడా…. కూడా దగ్గరుండి తన ప్రాంత ప్రజల సురక్షితమే తన లక్ష్యంగా పాటుపడుతుంది.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి సీతక్క ట్వీట్ వేశారు. తన నియోజకవర్గంలో దాదాపు 100 కిలోమీటర్ల పొడవున గోదావరి తీరం ఉందని…. అలాగే ఇప్పుడు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతం తన నియోజకవర్గం అని చెప్పారు. కావున అక్కడ నాశనం అయిపోయిన పంటలకు సంబంధించిన రైతులు అందరిని ఆదుకోవాలని ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫీస్ కు విజ్ఞప్తి చేశారు. అలాగే తన విన్నపాన్ని మన్నించి రైతులకు ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయాలని కోరారు.
My Constituency has 100 kilometres stretch of Godavari river, I requested Telangana Govt in assembly about flood bank revetment long back, now many poor farmers has to face this disaster @TelanganaCMO please consider my request again and help the farmers.@INCIndia @RahulGandhi pic.twitter.com/YjfnvcQumE
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) August 16, 2020
నిన్న రాత్రి నుండి సీతక్క తన అనుచరులతో కలిసి తన నియోజకవర్గం పరిధిలో భారీ వర్షం కురుస్తున్నా కూడా వారికి తోడుగా ఉంటూ.. జాగ్రత్తలు చెప్తూ…. వారిని పర్యవేక్షిస్తూ రోడ్లపైనే తిరగడం గమనార్హం. ఇలాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ఎంతమంది ఉంటారు చెప్పండి…!