సోషల్ మీడియా ఆరోపణలు, వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వంపై కోర్టు తీర్సులను కూడా టీడీపీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో లోకేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా యాక్టివ్ గా పని చేస్తోంది. జిల్లాలవారీగా విడిపోయి ప్రభుత్వంపై విపరీతమైన ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీఓ ఉంటూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారనే నెపంతో బీజేపీ ఎంపీపై టీడీపీ సోషల్ మీడియా కక్ష గట్టింది. ఆ ఎంపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు, విమర్శలతో కొత్త రాజకీయానికి తెర లేపింది. అదేంటంటే..
ఆ రాజ్యసభ సభ్యుడే కొత్త టార్గెట్..
ఏపీలో బీజేపికి ప్రస్తుతం ముగ్గురు కీలకంగా పని చేస్తున్నారు. వారిలో సోము వీర్రాజు, జీవీఎల్,, ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవదర్ ముఖ్యులు. ఏపీలో బీజేపీకి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ ముగ్గురి నిర్ణయమే కీలకం. వీరి ముగ్గురి నిర్ణయమే అంతిమం. అందుకే వైసీపీకి జీవీఎల్ మొదటి నుంచీ అనుకూలంగా.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూంటారు. రీసెంట్ గా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రానికి సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యల కారణంగా టీడీపీ జీవీఎల్ ను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కు జీవీఎల్ కు బంధువంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అంతేకాకుండా టీడీపీ అనుకూల మీడియాలో జీవీఎల్ కు వ్యతిరేకంగా వార్తలు కూడా వచ్చాయి. దీంతో జీవీఎల్ ను వైసీపీ అనుకూల వ్యక్తిగా చూపి ఏపీ వ్యవహారాలకు దూరంగా పెట్టించాలనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది.
ధీటుగా జావాబిస్తున్న జీవీఎల్..
జీవీఎల్ నరసింహారావు కూడా టీడీపీకి ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి శనివారం నాటి పత్రికలో జీవీఎల్ కు వ్యతిరేకంగా వచ్చిన వార్తపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగానే స్పందించారు. టీడీపీ జీవీఎల్ పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా బీజేపీకి ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తో.. రాష్ట్రంలో జీవీఎల్ ప్రభావం ఏంటో బీజేపీకి తెలిసు. ఈ నేపథ్యంలోనే జీవీఎల్ ను ఇబ్బంది పెడుతున్న టీడీపీపై బీజేపీ ఘాటు స్పందనకు నిదర్శమని తెలుస్తోంది.