ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కి కరోనా నెగిటివ్ వచ్చింది. చాలా రోజులుగా చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో కరోనా చికిత్స అందుకుంటున్న ఎస్పీబీ ఆరోగ్యం చివరికి కుదుటపడింది. కొద్ది వారాల ముందు అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వెంటిలేటర్ పై ఉంచారు. దీంతో దేశవ్యాప్తంగా అతని అభిమానులు అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
అయితే వెంటనే అతని కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం బాగుంది అని తెలియడంతో అభిమానులంతా కొద్దిగా కుదుట పడ్డారు. వెంటనే ఇండస్ట్రీలోని, సినీ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోని ప్రముఖులను అతను త్వరగా కోలుకోవాలని తాము ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వేసారు.
వారందరి ఆశీస్సులో ఏమో తెలియదు కానీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడింది. ఇక కొద్ది సేపటి క్రితమే అతనికి కరోనా టెస్ట్ చేస్తే అందులో నెగిటివ్ అని కూడా వచ్చింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!