ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ అంతా ఒకటే ప్రకంపనలు..! డ్రగ్స్…. డ్రగ్స్…. డ్రగ్స్..! బాలీవుడ్ యువ కథానయకుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఉదంతం తర్వాత మీడియా మొత్తం అనేక కోణాల్లో అతని మరణానికి కవర్ చేసింది. వాటిలో బయటపడ్డ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ చక్రబోర్తి సిఐడి విచారణలో తాను సుశాంత్ కి డ్రగ్స్ సప్లై చేసినట్లు…. అతనితో కలిసి వాటిని పుచ్చుకున్నట్లు ఒప్పుకుంది. అలాగే అతని బ్యాంకు లావాదేవీలు అన్నీ తానే చేసినట్లు స్వయంగా వెల్లడించింది.
అయితే ఇదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సుశాంత్ తో పాటు కలిసి తీసుకుంది అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అలాగే సైఫ్అలీఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ కూడా ఈ డ్రగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఇక తెలుగు ప్రజలు రకుల్ ఇలా డ్రగ్స్ పుచ్చుకుంది అంటే నమ్మలేక పోతున్నారు. యాంటీ – డ్రగ్స్ క్యాంపెయిన్ కి కూడా రకుల్ బ్రాండ్ అంబాసిడర్ కావడం గమనార్హం.
అయితే రకుల్ మాత్రం తన సన్నిహితుల వద్ద ఈ వార్తలను ఖండించినట్లు సమాచారం. తాను ఎటువంటి తప్పు చేయలేదని తన పేరు ఎందుకు బయటకి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని వాపోతోంది. ఒకవేళ ఆమె గనుక నేను డ్రగ్స్ తీసుకోలేదు అని చెబితే ఆమెకు సిఐడి వారు టెస్టులు చేస్తారు. ఆమె శరీరంలో ఉత్ప్రేరకాలు ఉన్నాయో లేదో రక్త పరీక్షలో కచ్చితంగా బయటపడుతుం.ది దాని నుండి మాత్రం ఏమి చేసినా తప్పించుకోలేదు. దానికి ముందు జాగ్రత్తలు వంటివి కూడా ఏమీ ఉండవు.
ఒకసారి శరీరం డ్రగ్స్ కి అలవాటు పడింది అంటే కచ్చితంగా బయట పడుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఈ విషయంపై చర్చించుకుంటూ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.