ఆర్జేడీ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఇకలేరు. ఆయనకు 74 సంవత్సరాలు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినా కానీ ఫలితం లేకపోయింది.
ఇటీవలే కరోనా బారిన పడిన ఆయన కొన్ని రోజుల తర్వాత కోలుకున్నారు. అయితే కరోనా నుండి కోలుకున్నా కూడా మళ్ళీ అనారోగ్యం బారిన పడడంతో ఆయన్ను ఎయిమ్స్ లో జాయిన్ చేసారు. దాదాపు 32 సంవత్సరాల పాటు ఆర్జేడీలో కొనసాగిన ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపారు. ఆర్జేడీ అధినేత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కూడా ఆ లేఖ పంపగా ఆయన రాంచిలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.