భారతదేశం ప్రస్తుతం అన్ లాక్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఒకటి తర్వాత ఒకటిగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అన్ లాక్ 5.0లో భాగంగా సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లకు అనుమతి జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే 50 శాతం కెపాసిటీతో మాత్రమే సినిమాలను ప్రదర్శించాలని నిబంధన విధించింది. ఇక వీటికి సంబంధించిన మరిన్ని మార్గదర్శకాలను అతి త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇక క్రీడాకారుల ట్రైనింగ్ కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్ కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. స్కూళ్ళు, విద్యా సంస్థలు ఎప్పటి నుండి తెరవాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత విద్యాసంస్థలు తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.