బిగ్ బాస్ హౌస్ లో నాలుగో సీజన్ లో ఇంటి సభ్యులుగా ఎంటరైన వారిలో మొదటిలో దివి క్యారెక్టర్ చాలా సూపర్ అంటూ చూస్తున్న వీక్షకులు తెగ పొగిడారు. చాలా ఫెయిర్ మాస్కులు లేకుండా నిర్మొహమాటంగా ఆడటంలో, మాట్లాడటంలో వ్యవహరిస్తుందని కితాబిచ్చారు. అయితే ఐదో వారం నామినేషన్ ఈ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులను బలమైన కారణం చెప్పి నామినేట్ చేయాలని బిగ్బాస్ ఆదేశాలు ఇవ్వగా… దివి లాస్య ని చాలా సిల్లీ కారణం చెప్పి నామినేట్ చేయడంతో.. దివి సూపర్ అబ్బో అని పొగిడిన వాళ్ళందరూ… సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేస్తున్నారు.
పూర్తి విషయంలోకి వెళ్తే.. ఇంటిలో ఉన్న సభ్యులందరికీ లాస్య చేసిన పప్పు తినడం వల్ల మోషన్స్ అవుతున్నాయి అని నామినేట్ చేసింది. దీంతో వెంటనే లాస్య.. దివి పై అరిచేసింది. తన పప్పు తిని అందరికీ మోషన్స్ అవుతున్నాయని నువ్వెలా చెప్తావ్.. దానికి నేను ఒప్పుకోను అంటూ సీరియస్ అయింది. సోషల్ మీడియాలో దివి చెప్పిన ఈ కారణం విని నెటిజన్లు నవ్వుతున్నారు.
ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ బాత్రూంకి వెళ్లి దివి కి వచ్చి మోషన్స్ అవుతున్నాయి, నాకేమైనా టాబ్లెట్ అని అంటున్నారా అంటూ దివి ని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఇదే రీతిలో సుజాత కూడా సిల్లి రీజన్ చెప్పి అరియానాను నామినేట్ చేసింది. వీరిద్దరు నామినేషన్ ప్రక్రియ లో చెప్పిన సిల్లి రీజన్ లు విని బయట నెటిజన్లు నవ్వుకుంటున్నారు.