ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సచివాలయం ‘నబ న్నా’ ముట్టడికి వచ్చిన వందలాది మంది బిజెపి కార్యకర్తలపై మమతా బెనర్జీ సర్కార్ పోలీసుల చేత టియర్ గాస్, నీటి ఫిరంగులు ప్రయోగించడం తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మమతా బెనర్జీ కి వార్నింగ్ ఇచ్చేటట్లు మాట్లాడారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో మమతా బెనర్జీకి రోజులు దగ్గరపడ్డాయి అన్నట్లు వ్యాఖ్యలు చేశారు జేపీ నడ్డా. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల పై నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఏంటి అంటూ ప్రశ్నించారు.
ఈ క్రమంలో మమతా బెనర్జీని పలు విధాలుగా హెచ్చరించారు. త్వరలోనే ముఖ్యమంత్రి స్థానంలో నుండి మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇంటికి పంపి చేస్తారని జేపీ నడ్డా ధ్వజమెత్తారు. అంతేకాకుండా వామపక్షాల పాలన కంటే మమతా బెనర్జీ పాలనలో రాజకీయ నాయకులపై ప్రత్యర్థులపై విమర్శలు దాడులు పశ్చిమ బెంగాల్ లో మరింత పెరిగాయని పేర్కొన్నారు. మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ విధంగానే రానున్నరోజుల్లో మమతా బెనర్జీ వ్యవహరిస్తే తట్టా బుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లడం గ్యారెంటీ అని జేపీ నడ్డా హెచ్చరించారు. కానీ మరోపక్క పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మాత్రం కరోనా నేపథ్యంలో పెద్ద పెద్ద గుంపులు ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అందువల్లే… నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు టాక్. ఏది ఏమైనా త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో బిజెపి కార్యకర్తలపై మమత సర్కార్ టియర్ గ్యాస్, నీటి ఫిరంగులు ఉపయోగించటం జాతియా రాజకీయాల్లో సంచలనంగా మారింది.