దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ సినీ తారలు సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసినదే. అందరూ దీపావళి శుభాకాంక్షలు అని మరి కొందరు ఎంతో భిన్నంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కోవకు చెందినవారే రేణు దేశాయ్. అందరితో పాటే రేణుదేశాయ్ కూడా దీపావళి శుభాకాంక్షలు కొంచెం భిన్నంగా తెలియజేశారు…
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ దీపావళి సందర్భంగా తన అభిమానులకు గ్రీటింగ్స్ తెలియజేశారు.సాధారణంగా దీపావళి పండుగ అంటేనే లక్ష్మీదేవి పూజ, దీపాల అలంకరణ టపాకాయల మోత… అలాంటిది టపాకాయలు కాల్చకుండా దీపావళి పండుగను జరుపుకోవాలని కొందరు సూచిస్తుంటారు. అయితే ఇది ఎంతో కష్టం. కొందరు టపాకాయలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అందువల్ల వాటిని నిషేధించాలని చెబుతుంటారు.
ఎన్నో సంవత్సరాల నుంచి దీపాలను వెలిగించి టపాకాయలను కాల్చడం ఆనవాయితీగా జరుపుకుంటున్న ఈ పండుగను ఒక్కసారిగా టపాకాయలు కాల్చ కూడదంటే కుదరని పని కాబట్టి, టపాకాయలను కాల్చే విషయంలో కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మంచిదనీ నటి రేణు దేశాయ్ తెలిపారు. ఈ విధంగా అయినా కొంతమేర కంట్రోల్ చేసుకున్నా వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం కొంతవరకు తగ్గించవచ్చని ఆమె ఎంతో సున్నితంగా, అందరికంటే భిన్నంగా తన అభిమానులకు అచ్చ తెలుగులో ఈ సందేశాన్ని తెలియజేశారు. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ తెలిపిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ టపాకాయలను పేల్చేటప్పుడు చేతులకు ఆల్కహాల్ శానిటైజర్ లు వాడకుండా జాగ్రత్త పడుతూ ఈ పండుగను జరుపుకోవాలని తన అభిమానులకు తెలియజేసిన సంగతి తెలిసినది.