NewsOrbit
న్యూస్

మహానగరం అంధకారానికి కారణాలు…

 

 

దేశ వాణిజ్య రాజధాని, మెట్రోపాలిటన్ సిటీ అయినా ముంబై లో కారు చీకట్లు అలుముకున్నాయి. ఎప్పుడు లేని విధంగా ముంబై మహా నగరంలోని అన్ని ప్రాంతాలు ఒకటిగా కరెంటు కోతకు గురి అయింది.విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడడంతో నగరం స్తంభించిపోయింది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. విద్యుత్ అధికారుల ప్రమేయం లేకుండానే పవర్ కట్ అయ్యింది. మహా నగరం లో అక్టోబరు 12న గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచి పోయిన విషయం తెలిసిందే. నగరమంతా విద్యుత సరఫరా ఆగిపోవడం వల్ల ప్రజలు బయాందోళనికి గురి అయ్యారు.ఉదయం 10 గంటల తర్వాత క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్‌ లేదు.విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో పలు రైల్‌ సర్వీసులు రద్దయ్యాయి,లోకల్ ట్రెయిన్ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆసుపత్రుల కోసం అత్యవసరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అయితే దీనికి సైబర్ దాడి ఏ కారణం అన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

mumbai city

ముందుగా విద్యుత్తును సరఫరా చేసే లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు పలుసార్లు ట్రిప్పింగ్ కావడంతో ముంబై, శివారు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయని, అనుకున్నారు అందరు. గ్రిడ్‌లో సాంకేతిక లోపం వల్లే విద్యుత్ సరఫరా నిలిచినట్టు, టాటా పవర్స్ వైఫల్యంతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని బృహణ ముంబయి విద్యుత్, సరఫరా విభాగం అధికారులు అప్పుడు తెలిపారు.

 

power-distribution

దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్టు సైబర్క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సైబర్‌ దాడి కారణం గానే పవర్‌ కట్‌ జరిగిందని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడం పై ముంబయి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పవర్‌ సప్లయ్‌, ట్రాన్స్‌ మిషన్‌ కు సంబంధించిన సర్వర్ల లో అనుమానాస్పద లాగిన్‌ లను సైబర్‌ విభాగం అధికారులు గుర్తించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.సింగపూర్ సహా దక్షిణాసియాలోని కొన్ని దేశాలకు చెందిన హ్యాకర్లు.. ముంబై పవర్ సప్లై ట్రాన్స్మిషన్ సర్వర్లలో లాగిన్ అయి పవర్ను తీసేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. లోడ్‌ డిస్‌ప్యాచ్‌ సెంటర్‌ ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సైబర్ దాసి వల్ల 400 కేవీ లైన్ ట్రిప్ అయినట్లు సమాచారం. ఎంఐడీసీ పాల్గర్ దహనూ లైన్లలో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముంబై నగరానికి వెళ్తున్న 360 మెగా వాట్ల పవర్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు సమాచారం.సైబర్ దాడి పైన తమ అనుమానాలు ప్రాథమికంగా నిర్ధారించిందే నని, పూర్తి రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని సైబర్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. సైబర్‌ ముప్పు పై మహారాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్‌ రౌత్‌ ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella