పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ త్వరలో ఆదిపురుష్ అన్న పాన్ ఇండియా సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి ప్రభాస్ హిందీలో చేస్తున్న స్ట్రైట్ సినిమా కాబట్టి హిందీలో కూడా అన్నీ వర్గాల ప్రేక్షకులతో పాటు మేకర్స్ లో కూడా క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనుండగా టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
కాగా దర్శకుడు ఓం రౌత్ రామాయణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ‘రాముడి’గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ సినిమా మీద భారీ అంచనాలు పెరిగేలా చేసింది. అదే అఫీషియల్ గా మేకర్స్ ప్రభాస్ ని రాముడి పాత్రకి సంబందించిన లుక్ రిలీజ్ చేస్తే ఇక ఆ అంచనాలు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు పది తలలు కలిగిన ‘లంకేష్’ గా నటించనున్నారు.
అయితే రీసెంట్ గా సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్ గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో సైఫ్ అలీఖాన్ క్షమాపణ కోరినప్పటికీ వివాదం ఇంకా ముదిరుపోతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా సైఫ్ తో పాటు దర్శకుడి పై కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ డిసెంబర్ 23న ఈ కేసు విచారణకు రానుంది. దీనిపై ‘ఆదిపురుష్’ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ లో కొంతమంది ఆదిపురుష్ సినిమా నుంచి సైఫ్ ని తొలగిస్తారన్న ప్రచారం చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమన్నది మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.