ఇటీవల 15 రోజుల వ్యవధిలో దాదాపు రెండు సార్లు గ్యాస్ ధర పెరగడం అతిపెద్ద వింతగా అభివర్ణిస్తున్నారు. పెట్రోల్ అదేవిధంగా గ్యాస్ ధరల పెంపుదల చాలా సాధారణం అన్నట్టుగా పెంచుకుంటూ పోతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై విపక్షాలు కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు కనపడటంలేదు.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మధ్యతరగతి కుటుంబాల పై పెద్ద భారంగా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ప్రజానీకం ఉన్నట్లు మీడియా సర్కిల్స్ లో టాక్ వినపడుతోంది. ఇటీవల ఒక గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయల పెంచుతూ తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా ధర పెరుగుదలతో ఢిల్లీలోనే సిలిండర్ ధర 640 రూపాయలు కాగా బయట మధ్యతరగతిపై కేంద్రం వేస్తున్న భారంపై ఎలాంటి స్పందన రావటం లేదు. ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా కుదేలయిన ప్రజానీకంపై కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సైలెంట్ గా గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోవడం పట్ల ప్రజలలో విమర్శలు భారీస్థాయిలో వస్తున్నాయి. మరోపక్క ప్రతిపక్షాలు ఇటువంటి విషయాలపై స్పందిస్తే అటుపక్క కేంద్ర ప్రభుత్వంపై రైతులు చేస్తున్నా ఉద్యమం దారి తప్పుతుందేమో అని వాళ్ళ రాజకీయ స్వార్థం చూసుకుంటున్నారు. దీంతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు ఎవరికివారు అన్నట్టుగా రాజకీయంగా ఆలోచించుకుంటూ ఉన్న తరుణంలో.. తాజాగా పెరిగిన ధరల విషయంలో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు.