వాట్సాప్ WhatsApp .. సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..! వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త పాలసీ నిబంధనలు కారణంగా ప్రజలు అసంతృప్తికి గురయ్యారు..వ్యక్తిగత వివరాలు అడిగిందని , ఫోన్ కాంటాక్ట్స్ , సందేశాలు, స్టోరేజీ చేసుకుంటుందని, వినియోగదారుల వ్యక్తిగత వివరాలు పక్కదారి పడుతున్నాయని వాట్సాప్ పై వార్తలు వస్తున్నాయి.. దీనికి ప్రత్యామ్నాయం కోసం సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు.. కొత్త పాలసీ నిబంధనలపై వచ్చిన పుకార్లు పై వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది..! ఇవన్నీ పుకార్లని వాటికి తాము సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందని వాట్సప్ తెలిపింది. మంగళవారం సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ స్పష్టత ఇచ్చింది.. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది.. మీ వ్యక్తిగత వివరాలు మేము రక్షణగా ఉంటామని ప్రకటించింది..
కొత్త నిబంధన పాలసీ పుకార్ల కారణంగా వారం రోజుల్లోనే వాట్సాప్ ను అన్ ఇన్స్టాల్ చేయడం. కొంతమంది ఆన్ లైక్ చేస్తున్నారు.వాట్సాప్ వినియోగం ఆపేసి టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లాక్ డౌన్ లోడ్లు చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో డౌన్ లోడ్స్ ఆగిపోయాయి. డిస్ లైక్ లు ఎక్కువయ్యాయి . ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికారికంగా స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. కొత్త పాలసీ నేపథ్యంలో వస్తున్న విమర్శలు పుకార్లపై వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది.
వాట్సప్ ప్రకటనలో కీలక అంశాలు..!!
*ఫేస్ బుక్ కు వాట్సప్ వివరాలు పంపము. ఇది అబద్దం ఎలాంటి వివరాలు పంచుకోము. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపం.
*కొత్త ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నాం. కొత్త పాలసీ నిబంధనలు అంగీకరిస్తేనే వాట్స్ ఆప్ వినియోగానికి అర్హులు. లేకపోతే ఖాతా ను తొలగిస్తాం.
*కొత్తగా అప్డేట్ చేసిన వెర్షన్ ఫిబ్రవరిలో అమల్లోకి తెస్తాం. ఇప్పటివరకు 400 మిలియన్ల వినియోగదారులు వాట్సాప్ కు ఉన్నారు.
* మీ వ్యక్తిగత కాంటాక్ట్ వివరాలు ఎవరికీ షేర్ చేయము.
*మీ లొకేషన్ ట్రాక్ చేయము.
*మీరు మెసేజ్ లు కనిపించకుండా చేసుకోవచ్చు.
*మీరు పంపిన లొకేషన్స్ కూడా వాట్సాప్ పర్యవేక్షించదు.
*మీ వివరాలు అన్నింటిపై గోప్యత పాటిస్తాము.
*ఇన్స్ టెంట్ మేసేంజింగ్ యాప్, వాట్స్ఆప్ ప్రైవెసీ పాలసీ అప్ డేట్ చేసి కొత్త నిబంధనలతో వర్షన్ త్వరలోనే తీసుకురానున్నది. ఇందులో నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..దేశం కు “యువోన్మేషం” తెచ్చిన రోజు..!!
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!