ప్రస్తుతం బుల్లితెరకు కూడా అభిమానులు పెరుగుతున్నారు. బుల్లితెర మీద వచ్చే సరికొత్త కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. అందుకే.. బుల్లితెర కూడా ఎక్స్ పాండ్ అవుతోంది.
దానికి ఉదాహరణలే ప్రతి పండుగకు ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్స్, కామెడీ షోలు ఎట్సెట్రా. బుల్లితెర మీద కామెడీకి చాలా స్కోప్ ఉంది. అందుకే జబర్దస్త్, బొమ్మ అదిరింది లాంటి షోలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.
జబర్దస్త్ గురించయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. గత 8 ఏళ్ల నుంచి జబర్దస్త్ అప్రతిహాతంగా విజయవంతంగా నడుస్తోంది. జబర్దస్త్ లో ఫేమస్ అయిన జంటలు అంటే సుడిగాలి సుధీర్ అండ్ రష్మీ, ఇమ్మాన్యుయేల్ అండ్ వర్ష. తాజాగా మరో జంట కూడా ఆన్ స్క్రీన్ మీద తెగ ఫేమస్ అయిపోతోంది.
ఆ జంటే ఆటో రాంప్రసాద్, బిగ్ బాస్ రోహిణి. అవును.. బిగ్ బాస్ రోహిణీ, ఆటో రాంప్రసాద్.. ఇద్దరూ ఈసంక్రాంతికి ఈటీవీలో ప్రసారమయ్యే అత్తో అత్తమ్మ కూతురో స్పెషల్ ఈవెంట్ లో డ్యాన్స్ తో కుమ్మేశారు. నో డౌట్.. జబర్దస్త్ లోకి మరో జంట వచ్చి చేరింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది.. అని నెటిజన్లు అంటున్నారు.
ఎలాగూ రోహిణి.. ప్రస్తుతం జబర్దస్త్ లో చిన్ని చిన్న క్యారెక్టర్లు చేస్తోంది. ఆటో రాంప్రసాద్.. సుడిగాలి సుధీర్ టీమ్ తో పాటు.. వేరు టీమ్స్ లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తున్నాడు. మొత్తం మీద జబర్దస్త్ కు సరికొత్త జంట వచ్చేసింది.. అని ఈ ఈవెంట్ తో అర్థమయిపోయింది.
సంక్రాంతి కానుకగా.. 14న ఉదయం అత్తో అత్తమ్మ కూతురో ఈవెంట్ ప్రసారం కానుంది. అప్పటి వరకైతే ఈ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.