NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎస్ఈసీ నిమ్మగడ్డకు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ..ఎమని రాశారంటే..?

ఏపిలో స్థానిక సంస్థల పంచాయతీ ప్రభుత్వం, ఎస్ఈసీ అన్నట్లుగా వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఓ పక్క కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నందున ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతుంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ప్రభుత్వ వినతిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మరో పక్క ఈ వివాదం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపై ముద్రగడ విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.

mudragada wrote letter to sec nimmagadda

రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ చేస్తున్న దాడి మీడియా ద్వారా చూస్తున్నాన్న ముద్రగడ..ఎన్నికలు అన్నవి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి నిర్వహించడానికి తమరు ప్రయత్నించాలి గానీ రాజకీయ నాయకులుగా పట్టుదలకు పోవడం మంచిది కాదని సూచించారు. గతంలో ఎన్టీఆర్ చిత్రంలో నేరం నాది కాదు ఆకలిది అన్నట్లుగా మిమ్మల్ని ఎవరో అదృశ్య శక్తి వెనుక ఉండి ఈ తలనొప్పులు ఇప్పిస్తున్నారని నా లాంటి వారికి అనుమానం కలుగుతోందని అన్నారు. చాలా పెద్ద చదువులు చదువుకొని పెద్ద హోదాలో ఉద్యోగాలో ఉంటూ రాజకీయాలు చేయడం మంచిగా లేదని అన్నారు. ఈ తగాదాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయమని అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలి కానీ ఇలా రచ్చ చేయడం మానండి అంటూ సలహా ఇచ్చారు ముద్రగడ.

ప్రస్తుత పరిస్థితి భారతదేశంలో మొట్టమొదటి సారిగా చూస్తున్నామన్నారు. ఎస్ఈసీకి ఉన్న అధికారాలతో సంస్కరణలు తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారులు గుండె మీద చేయి వేసుకుని లిక్కరు, డబ్బు లేకుండా ఎన్నికలు చేశామని చెప్పగలరా అని ప్రశ్నించారు. వాటిపై ఏ అధికారి దృష్టి పెట్టరనీ, ప్రకటనల వరకే పనిచేస్తున్నారు తప్ప లోతుగా ఆలోచించి ఏ చర్యలు తీసుకోరని ఆక్షేపించారు.

రాష్ట్ర ప్రభుత్వం, తమరు పట్టుదలతో తగవులు పడి న్యాయస్థానాలలో వాదించడానికి న్యాయవాదులను నియమించడానికి ఇరువురు ఖజానాను కొల్లగొడుతున్నారని అన్నారు ముద్రగడ. ప్రభుత్వ ఖజానలోని డబ్బు ప్రజలు కష్టార్జితంతో కట్టిన పన్నులు అన్న సంగతి మరవద్దని హితవు పలికారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బు రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయాలే గానీ పంతాలు పట్టింపులకు కాదన్న సంగతి తమరికి తెలియంది కాదని అన్నారు. బాధ్యత కల్గిన పౌరుడిగా ఈ విషయాలపై లేఖ రాసినట్లు ముద్రగడ పేర్కొన్నారు.

Related posts

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju