ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు Nimmagadda Ramesh Kumar. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు వైసీపీ ప్రభుత్వ నేతలకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పట్లో వైసీపీ పెద్దలు ఆయన పదవీ పోయేలా చేసినా గాని సుప్రీంకోర్టులో గెలిచి…తన పదవి తిరిగి పొందేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించటం అందరికీ తెలిసిందే.
తాజాగా పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం పై న్యాయస్థానాల్లో గెలవటం ఎన్నికలకు రెడీ అవ్వడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న క్రమంలో రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదని, ఎన్నికల కోడ్ అమలులో ఉందని తెలపడంతో గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బంది పనులు ఆగిపోవటం జరిగింది.
మరోపక్క ఇటీవల ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ అనే భారీ స్థాయిలో హడావిడి చేస్తూ వాహనాలను ఓపెన్ చేసిన జగన్ సర్కార్ కి నిమ్మగడ్డ ఎఫెక్టుతో .. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆదిలోనే రేషన్ డోర్ డెలివరీ పథకం ఆగిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఫిబ్రవరి ఫస్ట్ నుండి ఇంటింటికి రేషన్ అందించే ఆలోచన చేసింది వైసీపీ ప్రభుత్వం. కానీ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమం ఆగిపోయింది. మొత్తంమీద చూసుకుంటే మార్చిలోనే పదవి నుండి దిగిపోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్లైమాక్స్ లో వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.