Nimmagadda : ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల local body elections విషయంలో ప్రభుత్వం govt, ఎస్ఈసీ sec మధ్య పెద్ద వారే నడిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎన్నికలు వద్దు వద్దు అంటున్నా తన పదవీ కాలంలోపు ఎన్నికలు నిర్వహించే పోవాలన్న పట్టుదలతో ముందడుగులు వేశారు. చివరకు ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్ కావడంతో నిమ్మగడ్డ ప్రభుత్వంపై పైచేయి సాధించారు. అయితే పంచాయతీ ఎన్నికల ప్రారంభంలో కొంత ఎస్ఈసీకి ప్రభుత్వం నుండి సహకారం లోపించినా తరువాత సెట్ అయినట్లు కనబడింది. అధికార యంత్రాంగం పూర్తిగా సహాయ సహకారాలు అందించడంతో రెండు విడతల పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయింది. పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకూ నోటిఫికేషన్ విడుదల చేయవచ్చన్న వార్తలు వచ్చాయి. ఇందుకు తగినట్లుగా ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సంసిగ్దత వ్యక్తం చేసింది. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఎన్నికలను ఏ స్టేజీలో అయితే ఆగిపోయిందో ఆ స్టీజీ నుండే కొనసాగించాలని ఎస్ఈసీకి సూచించినట్లు సమాచారం.
దీంతో ఎస్ఈసీ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 12 కార్పోరేషన్ లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పక్కన బెట్టి ఊహించిన విధంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పురపాలక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఎస్ఈసీ ఈ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. నాడు అధికార పార్టీ బలవంతంగా నామినేషన్ లను ఉపసంహరింపజేశారని, పూర్తిగా పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని విపక్షాలు ఎస్ఈసీని కోరాయి. అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు, వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. వారు కోర్టుకు వెళితే ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు వస్తుందన్న గ్యారెంటీ లేకపోగా ఇంకా జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల నిమ్మగడ్డకు న్యాయస్థానంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎమ్మెల్యేలపై ఎస్ఈసీ ఉత్తర్వులు ఇస్తే హైకోర్టు నుండి అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. తాజాగా రేషన్ డోర్ డెలివరీ వాహనాల విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇవన్నీ గమనించిన నిమ్మగడ్డ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటం కోసమే మున్సిపల్ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు సంధించడం మొదలు పెట్టాయి. దీంతో కొంత వరకు విపక్షాలను సంతృప్తిపర్చడం కోసం స్క్రూటినిలో ఆమోదించిన తరువాత బలవంతంతో ఎవరైనా నామినేషన్ లు ఉపసంహరించామని వస్తే వారి నామినేషన్ లను పరిగణలోకి తీసుకోవాలంటూ ఆర్ ఓలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.