Karthikeya : “ఆర్ఎక్స్ 100” సినిమా తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుని మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ తరుణంలో ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో కార్తికేయ నటిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా చేసింది.
డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాని గీతా ఆర్ట్ 2 బ్యానర్ నిర్మించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మించిన ఈ సినిమా లో బస్తీ బాలరాజు పాత్రలో..మార్చురీ వెహికల్ డ్రైవర్ గా శవాలను తీసుకెళ్లే వాడిగా కార్తికేయ క్యారెక్టర్ ఉంటుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. హాస్పిటల్ నర్స్ పాత్రలో లావణ్య త్రిపాటి నటిస్తుందని ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ సరికొత్త కామెడీ నేపథ్యంలో ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇలాంటి తరుణంలో సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వటంతో త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ లెవెల్లో చెయ్యాలని గీతా ఆర్ట్ 2 బ్యానర్ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ని ఇన్వైట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అనసూయ అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగిందట. సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.