Suicide : గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఓ కేసుల విచారణ నిమిత్తం శివరామకృష్ణ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. పోలీస్ స్టేషన్ లో అతని విచారించేందుకు ఉంచగా పురుగు మందు తాగాడు. వెంటనే అతన్ని పోలీసులు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో శివరామకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే పోలీస్ స్టేషన్ లోకి పురుగుల మందు డబ్బా ఎలా వచ్చిందని మృతుడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కొట్టడం వల్లనే చనిపోయి ఉంటాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.