Ysr : దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఆయన వ్యక్తిగత పనులు అన్నీ కూడా తానై చూసుకున్న వ్యక్తి సూరీడు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ ఆయన వెన్నంటే ఉంటూ అన్ని పనులు చూసుకునే వాడు. ఆయన ఏది తినాలన్న, ఏ టైంలో ఎటువంటి టాబ్లెట్ వేసుకోవాలి అన్న దాని విషయంలో టైం టూ టైం సూరీడు దగ్గరుండి చూసుకునేవాడు. కానీ వైయస్ మరణించిన సమయంలో ఆయన దగ్గర లేకపోవడంతో వైఎస్ అభిమానులు మాత్రమే కాక చాలా మంది సూరిడు పాత్ర పై అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది.
ఆ తర్వాత అతను వైఎస్ కుటుంబానికి దూరం అవ్వటం మాత్రమే కాక కొన్ని సంవత్సరాలపాటు ఎవరికి కూడా కనబడలేదు. కానీ ఇటీవల మళ్లీ వెలుగులోకి రావడం…రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాత ముగింపు సభలో పాల్గొనడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా ఆయనపై దాడి హైదరాబాదులో దాడి జరగటం సంచలనంగా మారింది. మేటర్ లోకి వెళ్తే సూరీడు కూతురు గంగాభవాని…కి సురేంద్రనాథ్ అనే వ్యక్తి కి పెళ్లి అయింది.
అయితే భర్త వేధింపులు తట్టుకోలేక అతనిపై గృహహింస కేసు పెట్టి, పుట్టింటికి వచ్చేసింది గంగాభవాని. దీంతో తాజాగా సురేంద్రనాథ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న తన మామ సూరిడు ఇంటిలోకి వచ్చి… తనపై పెట్టిన కేసును వాపస్ చేసుకోవాలని.. గొడవ సృష్టించి సూరిడు తలపై క్రికెట్ బ్యాట్ తో కొట్టినట్లు తెలుస్తోంది.