COVID 19: ప్రజల్లో వ్యాక్సిన్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అపోలో హాస్పిటల్స్ వారు ఒక అధ్యయనం చేశారు. కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత దాని ప్రభావంపై ఈ అధ్యయనం దృష్టి సారించింది.
ఈ అధ్యయనం జనవరి 16 నుండి మే 30 మధ్య దేశవ్యాప్తంగా 30,000 మంది ఆరోగ్య కార్యకర్తలను కవర్ చేసింది. అధ్యయనంలో భాగమైన వారికి రెండు మోతాదులతో లేదా ఒకే మోతాదులో వ్యాక్సిన్ ఇచ్చారు.
అధ్యయనం యొక్క ఫలితం ఏమిటంటే, టీకాలు 95 శాతం ఆరోగ్య సంరక్షణ కార్మికులను కోవిడ్ బారి నుండి రక్షించాయి. కేవలం 4.28 శాతం మంది ఆరోగ్య కార్యకర్తల్లో టీకా అనంతరం ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందింది, అది కూడా అంతగా తీవ్రమైన స్థాయిలో అయితేకాదు. ఇక మరణాలు అయితే అసలు సంభవించనేదు.
కొత్త అధ్యయనం గురించి అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ, టీకాలు సురక్షితంగా ఉన్నాయని మరియు ఇది వైరస్ వేరియంట్స్ ని కూడా నిరోధిస్తుందని ఈ అధ్యయనం సూచిస్తుంది అని వివరించారు. వైరస్పై పోరాటంలో కోవిడ్ టీకాలు అధిక సంఖ్యలో వేయడం ముఖ్యమని ఆయన అన్నారు.
అధ్యయనంలో భాగమైన ఆరోగ్య సంరక్షణ కార్మికులలో, 91.45 శాతం మందికి కోవిషీల్డ్ మోతాదు లభించగా, 8.99 శాతం మంది కోవాక్సిన్ పొందారు. వారిలో 90 మంది ఆసుపత్రి పాలయ్యారు,
వారిలో ముగ్గురు ఐసియు సదుపాయంలో చేరారు. పాక్షిక టీకాలు పొందిన ఆరోగ్య సంరక్షణ కార్మికులలో 5.14 శాతం మందికి ఈ మహమ్మారి సోకింది.