నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బావుంటే సినిమా ఇండస్ట్రీ బావుంటుందని నమ్మే హీరోల్లో నిఖిల్ ఒకరు. హీరో నిఖిల్ని నిర్మాతల హీరో అంటుంటారు. అందుకు కారణం ఆయన సినిమా రిలీజ్ అనేది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సౌలభ్యాన్ని ఆధారంగా చేసుకునే ఉంటుంది. ఇప్పుడు నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం `అర్జున్ సురవరం` చిత్రాన్ని కూడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కోసం రిలీజ్ డేట్ మార్చుకున్నాడు. నిజానికి ఈ చిత్రం మార్చి 29న విడుదల కావాల్సి ఉంది. అయితే అప్పటికే ఎన్నికలు సమీపిస్తాయి. ప్రజలు ఆ సమయంలో ఎన్నికలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి సినిమాను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేద్దామని నిర్మాతలు భావించారు. అయితే అదే సమయంలో `అర్జున్ సురవరం` నిర్మాతల్లో ఒకరైన బి.మధుగారి మరో సినిమా `కాంచన 3` విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. ఆ సినిమా డేట్ను మిస్ చేసుకుంటే కష్టం కాబట్టి… నిర్మాతలు సహా డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేర తన సినిమా `అర్జున్ సురవరం`ని మే 1నే విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాడు నిఖిల్. సమ్మర్ కావడం.. అప్పటికే ఎగ్జామ్స్ అన్నీ పూర్తి అయిపోవడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అలాగే మే 1న కార్మిక దినోత్సవం కాబట్టి.. ఇది కూడా `అర్జున్ సురవరం`కు కలిసొచ్చే అంశం కానుంది.
ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సునీల్ నారంగ్ 4 కోట్ల రూపాయలకు కోనుగోలు చేశారు. ఆంధ్ర, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కాగా.. ఓవర్సీస్ బిజినెస్ 1 కోటి రూపాయలకు అమ్ముడైయ్యాయి.
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!