Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఎంచుకునే పాత్రలు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాయి. ఆయన అభిమానులనే కాదు సామాన్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంటాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కి అసాధారణమైన క్రేజ్ అండ్ పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి. ఇక ఆయన సినిమాలంటే బాలీవుడ్
కోలీవుడ్ హీరోలకి ఇన్స్పిరేషన్. అంతేకాదు ఆయన సినిమాలను బాలీవుడ్ లో నిర్మించాలని నిర్మాతలు, దర్శకులు, హీరోలు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాను బాలీవుడ్ లో నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ రైట్స్ దక్కించుకుందని చెప్పుకుంటున్నారు.
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఈ సినిమా రీమేక్ మూవీలో నటిస్తున్న పవన్ – రానాలు ఇప్పుడు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్ భీమ్లా నాయక్ గా పవర్ ఫుల్ రోల్ లో పవన్ నటిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. నిత్యా మీనన్ పవన్ కి జంటగా నటిస్తుండగా ఆమె కూడా తాజాగా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
Pawan kalyan : హిందీ డబ్బింగ్ హక్కులు దాదాపు రూ. 23 కోట్లకు అమ్ముడు పోయాయని సమాచారం.
అయితే ఎప్పుడైతే భీమ్లా నాయక్ గా పవన్ లుక్ రిలీజ్ చేయగానే సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా హిందీ రైట్స్ కోసం భారీగా ఆఫర్ వచ్చిందట. సోషల్ మీడియాలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుండగా హిందీ డబ్బింగ్ హక్కులు దాదాపు రూ. 23 కోట్లకు అమ్ముడు పోయాయని సమాచారం. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2022 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకి త్రివిక్రం డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా చేస్తూనే క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు లో కూడా పాల్గొంటున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్, ఏ.ఎం. రత్నం నిర్మాత.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!