AP CM YS Jagan: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు ఒడిశాకు చెందిన కార్మికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. మృతి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులకు ఒకొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ మేరకు పరిహారం అందజేయాలని అదికారులను సీఎం ఆదేశించారు.
బతుకు తెరువు కోసం ఒడిశా నుండి రాష్ట్రానికి వచ్చి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతా దృక్పదంతో సాయం అందించాలని సూచించారు. రొయ్యల చెరువు యాజమాన్యంతో నుండి కూడా మృతుల కుటుంబాలకు తగిన సాయం అందేలా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు.
రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన కార్మికులు కాపలాదారులు గా ఉన్నారు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఘటన జరిగిన 24 గంటలలోపే సీఎం వైఎస్ జగన్ స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.