KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. కీలకమైన నియోజకవర్గాల పునర్విభజనపై సంచలన ప్రకటన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2026 తర్వాతే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది.
Read More : KCR: బీపీ పెరుగుతోంది అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు…
కేంద్రం సంచలన నిర్ణయం..
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ఇంటర్-అలియా సెక్షన్ 26(1) ప్రకారం రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం తెలంగాణలోని 119 స్థానాలను 153కి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 175నుంచి 225కి పెంచాలి. ఈ నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ తో పాటు తెలంగాణలోని నియోజకవర్గాలను ఒకేసారి పునర్విభజన చేస్తుందా అనే ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను 2026 తర్వాత పునర్విభజన చేసే దిశగా కేంద్రం ఆలోచన చేస్తుందని తెలిపారు. ఈ లెక్క ప్రకారం 2031 కంటే ముందు నియోజకవర్గాల పునర్విభజన కాదు. కొత్త అసెంబ్లీ స్థానాలు ఉనికి లోకి రావు అనేది స్పష్టమైంది.
Read more: KCR: టీఆర్ఎస్ నేతలకు అదిరిపోయే షాకిచ్చిన కేసీఆర్
టీఆర్ఎస్ ఏమంటుందంటే…
తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కేంద్రానికి మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంచేందుకు మార్గం ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యనేత బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు విభజన చట్టంలో వెంటనే సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26 లో సబ్జెక్ట్ అనే పదం తొలగించి.. Not withstanding ( ఏదీ ఏమీ అయినప్పటికీ కూడా ) అనే పదాన్ని చేర్చాలన్నారు. చట్ట సవరణ చేస్తే అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉందని వినోద్ కుమార్ తెలిపారు. చిన్న సవరణతో సరిపోయే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందన్నారు.