Grama sachivalam employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అది ఏమిటంటే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వీరి ప్రొబేషన్ పూర్తి అయ్యేలోపు డిపార్ట్మెంటల్ పరీక్షతో పాటు సీబీఏఎన్ పరీక్షలు నిర్వహించాలని తలపెట్టింది. ఈ మేరకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే చాలా మంది డిపార్ట్ మెంటల్ టెస్ట్ లు రాశారు. మళ్లీ పరీక్షలు ఏమిటి అనే ఆందోళన వారిలో మొదలైంది.
ఈ నేపథ్యంలో ఇటీవల సంబంధిత యూనియన్ నేతలు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే వేలాది మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది డిపార్ట్ మెంటల్ టెస్ట్ లు రాసి ఉత్తీర్ణులయ్యారనీ, మళ్లీ పరీక్షలు నిర్వహించడం తగదని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞఫ్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కేవలం డిపార్ట్ మెంటల్ పరీక్ష తప్ప ఏ పరీక్షలు నిర్వహించడం జరగదని అజయ్ జైన్ పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరూ ప్రొబేషన్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. సీబీఏఎస్ పరీక్షల కానీ ఏ ఇతర అదనపు పరీక్షలు ఉద్యోగులకు నిర్వహించడం లేదని చెప్పారు.
రాష్ట్రంలో 2019 అక్టోబర్ 2వ తేదీన గ్రామ సచివాలయాల శాఖను ఏర్పాటు చేశారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న లక్షా 34 లక్షల మంది ఉద్యోగులందరూ డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసైతే చాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయజ్ జైన్ స్పష్టం చేశారు.